VZM: పిడుగు పడి ఓ మహిళ మృతి చెందిన సంఘటన తెర్లాం మండలంలో శుక్రవారం చోటు చేసుకుంది. బూరిపేటకు చెందిన పూడివలస వెంకటమ్మ (40) శుక్రవారం మధ్యాహ్నం పశువులను మేపుతున్న సమయంలో పిడుగులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఆ సమయంలో పిడుగు పడటంతో ఆమె అక్కడకక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఈమెకు భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు.