TG: ఏపీ సీఎం చంద్రబాబుకు రేవంత్ రెడ్డి దాసోహమయ్యారని మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. రాష్ట్ర కేబినేట్ భేటీ తీవ్ర నిరాశకు గురిచేసిందన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఒక్కడీఏ ఇచ్చేందుకు ముచ్చటగా మూడు కమిటీలు వేశారని విమర్శించారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అబద్ధాలు చెప్పడంతో.. సీఎం రేవంత్ రెడ్డిని మించిపోతున్నారని ఎద్దేవా చేశారు.