SKLM: పశువుల దాణాను రైతులు వినియోగించుకోవాలని కోటబొమ్మాళి మండలం మాజీ పీఏసీఎస్ అధ్యక్షుడు కింజరాపు హరివరప్రసాద్ అన్నారు. కోటబొమ్మాళి మండలం పశువైద్య శాఖ అధికారి లకినాన కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో శనివారం రైతులకు హరివరప్రసాద్ పశువుల దాణాను నిమ్మాడ వశువైద్య కేంద్రం వద్ద పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం పశువుల రైతులు కోసం సబ్సిడీ ఇచ్చిందన్నారు.