BHPL: జిల్లాలో నేడు విషాదం చోటుచేసుకుంది. మహదేవపూర్ మండలం అంబాట్పల్లి సమీపంలోని మేడిగడ్డ బ్యారేజీ ఎగువన ఈతకు వెళ్లిన ఆరుగురు విద్యార్థులు గల్లంతయ్యారు. మృతులు 18 ఏళ్ల వయస్సు గలవారని సమాచారం. వీరిలో నలుగురు అంబాట్పల్లికి, ఇద్దరు మహాముత్తారం మండలం కొర్లకుంటకు చెందినవారని తెలుస్తోంది. పోలీసులు ఘటనపై విచారణ జరుపుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.