ATP: గుత్తి ఎంపీడీవో ఆఫీస్ సమీపంలో గల రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద శనివారం కంటైనర్ లారీ, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు వాహనాల రాకపోకలకు అంతరాయం లేకుండా తగు చర్యలు తీసుకున్నారు. ఈ ఘటనలో కారు పాక్షికంగా దెబ్బతింది. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.