MDK: మెదక్ సమీపంలోని నవాబ్ పేట వద్ద జరిగిన బక్రీద్ వేడుకల్లో ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు శనివారం పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బక్రీద్ పండుగ త్యాగానికి ప్రతిక అని చెప్పారు. మనకు ఉన్నదాంట్లో కొంత భాగం పేదవారికి సహాయం చేయాలని పండుగ సూచిస్తుందని పేర్కొన్నారు.