అన్నమయ్య: ఆపరేషన్ కగార్ను కేంద్రం వెంటనే నిలిపివేయాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. శనివారం మదనపల్లెలోని ఎస్టీయూ కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ .. కేంద్రం, మావోయిస్టులు శాంతి చర్చలతో సమస్యను పరిష్కరించుకోవాలన్నారు. ఈనెల 12న స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ప్రజా సంఘాలతో ధర్నా చేస్తామని తెలిపారు.