ELR: ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం మండల కమిటీ సమావేశం జంగారెడ్డిగూడెం ప్రజా సంఘాల కార్యాలయంలో శనివారం నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు జీవరత్నం మాట్లాడుతూ.. ఉపాధి కూలీల పని సమయం ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు చేయించాలని డిమాండ్ చేశారు. ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఉపాధి కూలీలు సుమారు 268 మంది మృత్యువాతకు గురయ్యారని వారికి ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించాలన్నారు.