ADB: సైబర్ నేరానికి గురైతే 1930 నంబర్ను సంప్రదించాలని జిల్లా SP అఖిల్ మహాజన్ శనివారం తెలిపారు. ప్రజలు సైబర్ నేరాల పట్ల అప్రమత్తతతో ఉండాలని సూచించారు. సైబర్ బారిన పడిన గంటలోపు సంప్రదిస్తే డబ్బులు తిరిగి వచ్చే అవకాశం ఎక్కువ ఉందన్నారు. ఈ మేరకు గతవారం రోజుల్లో జిల్లావ్యాప్తంగా దాదాపు 15 ఫిర్యాదులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.