NLG: సోషల్ మీడియాపై పోలీస్ శాఖ పూర్తిస్థాయి నిఘా ఏర్పాటు చేసిందని, ఎవరైనా వివాదాస్పద పోస్టులు పెడితే వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తప్పవని నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అన్నారు. బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకుని శనివారం నల్గొండ పట్టణంలోని మునుగోడు రోడ్డులో గల ఈద్గా వద్ద పోలీస్ బందోబస్తును ఆయన పరిశీలించారు.