ELR: మూగజీవాలను హింసించినా, వధించిన, అక్రమంగా రవాణా చేసినా చట్టరీత్యా కఠిన చర్యలు ఉంటాయని పశుసంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు డా గోవిందరాజు చెప్పారు. మూగజీవాల హింస, వదించడం, అక్రమ రవాణా నిర్మూలనపై అవగాహనకు గురువారం ఏలూరులోని గన్ బజార్ సెంటర్ ప్రజలు, అధికారులతో ర్యాలీ నిర్వహించారు. జంతు రవాణా చేయాలంటే అధికారుల అనుమతి తప్పనిసరి అని అన్నారు.