W.G: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ను రాజ్యసభ సభ్యుడు పాక వెంకట సత్యనారాయణ గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనను లోకేష్ శాలువా కప్పి స్వాగతించారు. అనంతరం కొద్దిసేపు ప్రస్తుత రాజకీయాలపై భీమవరం అభివృద్ధిపై చర్చించారు. ఈ సందర్భంగా పాకాకు లోకేష్ అభినందనలు తెలియజేశారు.