ప్రకాశం: కనిగిరి ఎంపీడీవోగా ఓరుగంటి ప్రభాకరశర్మ గురువారం ఎంపీడీవో కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈయన పెదచెర్లోపల్లి ఎంపీడీవోగా పనిచేస్తున్నారు. జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కనిగిరికి బదిలీ అయ్యారు. ఆయన మాట్లాడుతూ.. మండలంలోని అన్ని గ్రామాలలో నీటి సమస్యపై ప్రధాన దృష్టి సాదిస్తానన్నారు.