KKD: ఉమ్మడి జిల్లా పరిధిలోని ప్రభుత్వ, జడ్పీ, మున్సిపల్ యాజమాన్య పాఠశాలల్లో స్కూల్ అసిస్టెంట్లుగా పనిచేస్తున్న ఉపాధ్యాయులు బదిలీలకు అవకాశం ఏర్పడింది. బుధవారం వెబ్ ఆప్షన్లో నమోదు చేసుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారి పి. రమేశ్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. బదిలీ అయ్యే ఉపాధ్యాయులు ఆప్షన్ ఇచ్చుకోవాలని సూచించారు.