ప్రకాశం: మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపుమేరకు బుధవారం బేస్తవారిపేట పట్టణంలో వెన్నుపోటు దినోత్సవం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వైసీపీ ఇన్ఛార్జ్ కుందూరు నాగార్జున రెడ్డి తెలిపారు. ఉదయం 9: 30 సమయంలో నిరసన ర్యాలీ చేపట్టి అనంతరం స్థానిక తహసీల్దార్కు వినతి పత్రం సమర్పిస్తామని నాగార్జున రెడ్డి వెల్లడించారు.