PDPL: అభివృద్ధి పనులకు అవసరమైన భూమిని ప్రణాళిక బద్ధంగా సేకరించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. మంగళవారం మంథని ప్రాంతంలోని అంగులురు శివారు వద్ద రోడ్లు భవనాల శాఖ ద్వారా చేపట్టే శ్రీపాద మార్గ్ బైపాస్ రోడ్డు నిర్మాణానికి అనువైన భూములు, ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు 70 ఎకరాల భూమి, మంథని ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపంలో భూమిని పరిశీలించారు.