MDK: జిల్లాలో మంగళ తొలి రోజు అయిన మంగళవారం నిర్వహించిన రెవెన్యూ సదస్సులో 939 దరఖాస్తులు వచ్చినట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. సదస్సులో వచ్చిన దరఖాస్తులను తహసీల్దారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి వెంటనే పరిష్కరించాలని పేర్కొన్నారు. రెవెన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తులపై నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.