KNR: రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు తీసుకొచ్చి తెలంగాణ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే తమ ధ్యేయమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. మంగళవారం “ఎవర్జెంట్ టెక్నాలజీస్” గ్లోబల్ వాల్యూ సెంటర్ను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఏడాదిన్నర వ్యవధిలో రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులను తెచ్చామన్నారు.