TG: తెలుగుజాతి ఎదిగి దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. వికసిత్ భారత్ 2047 లక్ష్యాల్లో తెలుగు రాష్ట్రాలు ముందుండాలని ఆకాంక్షించారు. తెలంగాణలో విమాన సౌకర్యాల అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తానని.. రాష్ట్ర ప్రజలకు శాంతి, అభివృద్ధి, నూతన అవకాశాలు లభించాలని ఆశాభావం వ్యక్తం చేశారు.