సత్యసాయి: కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలల మీద చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎ జిల్లా అధ్యక్షులు శివకుమార్ డిమాండ్ చేశారు. సోమవారం పెనుకొండ బాలుర వసతి గృహంలో శివకుమార్ మాట్లాడారు. పెనుకొండ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు పాఠ్యపుస్తకాల పేరుతో వేలకు వేలు ఫీజులు దోపిడీ చేస్తున్నారని తెలిపారు. విద్యార్థులకు న్యాయం చేయాలని కోరారు.