AKP: మునగపాక మండల పాటిపల్లి గ్రామానికి చెందిన కోయిలాడ మారుతి ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించాడు. జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం ద్వారా ఐదు లక్షల బీమా చెక్కును ఎమ్మెల్సీ కె.నాగబాబు చేతుల మీదుగా మారుతి తల్లికి చెక్కును సోమవారం మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో అందజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల అధ్యక్షులు టెక్కలి పరశురాం పాల్గొన్నారు