TPT: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యోగాంధ్ర కార్యక్రమం ఈ నెల 4వ తేదీన చంద్రగిరి పట్టణంలోని రాయలవారి కోటలో నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే పులివర్తి నాని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు హాజరవుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.