IPL 2025లో భాగంగా RCB, పంజాబ్ మధ్య రేపు ఫైనల్ మ్యాచ్ జరగనుంది. అయితే, ఈ మ్యాచ్కు వర్షం ముప్పు పొంచి ఉన్నట్లు వాతావరణశాఖ వెల్లడించింది. పంజాబ్, ముంబై మధ్య జరిగిన క్వాలిఫయర్-2 వర్షం కారణంగా దాదాపు రెండు గంటలు ఆలస్యంగా ప్రారంభమైంది. ఫైనల్ మ్యాచ్కు కూడా వర్షం ఆటంకం కలిగించే అవకాశం ఉండటంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అయితే, ఫైనల్ మ్యాచ్కు రిజర్వ్ డే ఉంది.