AP: మాజీ సీఎం జగన్పై ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. కేవలం 11 సీట్లకే పరిమితమైనప్పటికీ జగన్ మారలేదని ఆయన అన్నారు. తెనాలిలో రౌడీషీటర్లను పరామర్శిస్తాననడం దుర్మార్గమని మండిపడ్డారు. గంజాయి గ్యాంగ్, బ్లేడ్ బ్యాచ్లకు జగన్ అండగా ఉంటారంటూ ఆరోపించారు. రౌడీషీటర్లపై పోలీసులు తీసుకున్న చర్యలను ప్రజలు హర్షిస్తున్నారని సోమిరెడ్డి పేర్కొన్నారు.