NZB: ప్రజల భద్రతను పెంచడం, పోలీసింగ్ పద్ధతులను ఆధునీకరించడంలో భాగంగా నిజామాబాద్ పోలీసులు స్మార్ట్ పోలీసింగ్ కార్య క్రమంలో భాగంగా డ్రోన్ మొబైల్ పెట్రోలింగ్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని సోమవారం టీజీఎండీసీ ఛైర్మన్ అనిల్, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పోలీస్ పరేడ్ గ్రౌండ్లో లాంఛనంగా ప్రారంభించారు.