ASR: ప్రధానమంత్రి సూర్య ఘర్ సోలార్ విద్యుత్తుపై ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ సోమవారం అధికారులను ఆదేశించారు. ఇంటి పైకప్పుపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకునే వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం రాయితీలు ఇస్తుందన్నారు. విద్యుత్తు వినియోగదారులు సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయడం వలన విద్యుత్తు పోతుందనే టెన్షన్ ఉండదన్నారు.