BDK: మణుగూరు మండల పరిధిలోని సాంబాయిగూడెం నుండి పగిడేరు గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి గుంతల మయంతో ప్రమాద భరితంగా ఉందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత కొద్దిరోజుల క్రితం కురిసిన వర్షానికి బీటీ రోడ్డు కొట్టుకుపోగా అదే గుంత పెద్దగా తయారై ఆ రోడ్డుపై ప్రాణ సంకటంగా తయారైంది. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు రోడ్డు మరమ్మతులు చేపట్టాలని కోరారు.