ఆదిలాబాద్: తలమడుగులో ఇందిరమ్మ ఇళ్ల సర్వే జరుగుతున్న తీరును మంగళవారం కలెక్టర్ రాజర్షి షా ఆకస్మికంగా తనిఖీ చేశారు. పంచాయతీ కార్యదర్శిని సర్వేలో ఏర్పడుతున్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. లాగిన్ సమస్య ఉందనడంతో సమస్య పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఆయన వెంట తహశీల్దార్ రాజ్ మోహన్, ఎంపీడీఓ చంద్ర శేఖర్, తదితరులు ఉన్నారు.