AP: కూటమి ప్రభుత్వంపై మాజీ సీఎం జగన్ తీవ్ర విమర్శలు చేశారు. కూటమి పాలనలో మహిళలు, బాలికలకు రక్షణ లేదని మండిపడ్డారు. ‘మాటల్లో మహిళలపై గౌరవం చూపెడుతున్నారు. చేతల్లో మహిళలపై అసహ్యకర వైఖరి అవలంభిస్తున్నారు. కూటమి ఏడాది పాలనలో 188 అత్యాచారాలు, 15 హత్యాచారాలు జరిగాయి. మహిళల గౌరవం అనే ముసుగులో వైసీపీపై పగ తీర్చుకోవడం సిగ్గుచేటు’ అని పేర్కొన్నారు.