NDL: అధికారుల పర్యవేక్షణ లేని హంద్రీనీవా పనులను ఉన్నతస్థాయి కమిటీ విచారణ చేపట్టాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం నంది కోట్కూరు మండలంలోని మల్యాల హంద్రీనీవా పనులను సీపీఎం బృందం పక్కిరి సాహెబ్, గోపాలకృష్ణతో కలిసి పరిశీలించారు. జిల్లా నాయకులు నాగేశ్వరరావు మాట్లాడుతూ.. పనులు గుత్తే దారులకు అప్పజెప్పి మెగా కంపెనీ చేతులు దులుపుకుందని ఆరోపించారు.