CTR: పలమనేరు ఎంపీడీవో కార్యాలయాన్ని జెడ్పీ ఛైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు గురువారం తనిఖీ చేశారు. అనంతరం ఎంపీడీవోతో పలు విషయాలపై చర్చించారు. మండలంలోని తాగునీటి సమస్య అడిగి తెలుసుకుని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి సమస్యలను పరిష్కరిస్తామని జడ్పీ ఛైర్మన్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో, తదితరులు పాల్గొన్నారు.