కోనసీమ: ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో నిత్య అన్నదాన పథకం భవన నిర్మాణానికి అమలాపురం వాస్తవ్యులు వరద శరన్ కుమార్, అమృత దంపతులు వారి కుటుంబ సభ్యులు శుక్రవారం రూ. 1,01,116 విరాళాన్ని అందజేశారు. ఈ మేరకు దాత కుటుంబ సభ్యులు తొలుత స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం దాతలకు ఆలయ సిబ్బంది స్వామి చిత్ర పటం అందజేశారు.