VZM: బొబ్బిలి DSP భవ్యా రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం మెంటాడ మండలంలోని ఉద్దంగిలో ప్రముఖ మానసిక వైద్యులు రాజశేఖర్, జనవిజ్ఞాన వేదిక సభ్యులు శ్రీను, ఎస్ఐ సీతారాం గ్రామస్తులకు చేత బడులు, చిల్లంగులపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. మూఢనమ్మకాలు విడనాడాలని, చిల్లంగి, చేతబడులు లేవని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కొర్రాయి లక్ష్మి పాల్గొన్నారు.