TPT: టీటీడీ పాఠశాలలలో ఈ నెల 16 నుండి 19 వరకు 8, 9,10 తరగతుల విద్యార్థిని విద్యార్థులకు జరుగనున్న సద్గమయ శిక్షణ తరగతులు వాయిదా పడ్డాయని టీటీడీ అధికారులు తెలిపారు. పరిపాలనా పరమైన కారణాలు మూలంగా వాయిదా వేసినట్లు డీపీపీ కార్యదర్శి శ్రీరాం రఘునాథ్ వెల్లడించారు. తదుపరి శిక్షణ తరగతుల తేదీలను త్వరలో ప్రకటిస్తామన్నారు.