SRCL: విద్యుత్ షాక్ తగిలి ఒకరు మృతి చెందిన ఘటన ముస్తాబాద్ మండలంలో జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. మండలంలోని తెర్లమద్ది గ్రామనికి చెందిన బైతి రాజయ్య (50) ఇంటి వద్ద స్నానం చేయడానికి వెళుతుండగా.. ప్రమాదవశాత్తు విద్యుత్ వైర్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.