VZM: ఉపాధ్యాయులు విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపాలని డీఈవో మాణిక్యాల నాయుడు సూచించారు. స్థానిక గురజాడ పాఠశాలలో JVV జిల్లా శాఖ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులను నేడు నిర్వహించారు. సమాజాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దే సత్తా ఉపాధ్యాయులకే ఉందని, ప్రతి ఉపాధ్యాయుడు తమ పిల్లల పట్ల ఏ విధంగా శ్రద్ధ చూపిస్తారో.. విద్యార్థుల పట్ల కూడా అదే విధంగా మెలగాలన్నారు.