SRCL: సిరిసిల్ల పట్టణంలోని మందాడి వనజారెడ్డి ఇంటిలో బ్రహ్మ కమలం ఆదివారం విరబూసింది. సంవత్సరానికి ఒకసారి మాత్రమే ఈ పువ్వు పూస్తుందని స్థానికులు తెలిపారు. చాలా అరుదుగా కనిపించే ఈ చెట్టు పువ్వు పూయడంతో కుటుంబీకులు ఆనందం వ్యక్తం చేశారు. అ పువ్వుని తంగళ్ళపల్లిలోని లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో సమర్పించామని వనజా రెడ్డి తెలిపారు.