జనగాం: జిల్లాల్లోని 6 మండలాల్లో, 9 గిరిజన గ్రామాల్లో జూన్ 15 నుంచి జూలై 15 వరకు పీఎం ధర్తీ ఆభా జన్ భాగీదారి అభియాన్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ శనివారం తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆధార్, రేషన్, పెన్షన్, ఇన్సూరెన్స్ వంటి సేవలకు వినతులు స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు.