VZM: ఎన్టీఆర్ జిల్లాలో రేపటి నుంచి జరగనున్న యోగాంధ్ర రాష్ట్ర స్థాయి పోటీలకు జిల్లా నుంచి విద్యార్థులు ఆదివారం తరలి వెళ్లారు. జిల్లా నుంచి మొత్తం 25 మంది సభ్యుల బృందం బయలుదేరింది. వీరికి జిల్లా జాయింట్ కలెక్టర్, యోగాంధ్ర నోడల్ అధికారి ఎస్.సేతు మాధవన్, డీఆర్డీఏ పీడీ కళ్యాణ చక్రవర్తి శుభాకాంక్షలు తెలిపారు.