VKB: పేదవాడి సొంతింటి కల నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఆదివారం అన్నారు. 200 మంది లబ్ధిదారులకు మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్స్ లెటర్లను చౌడాపూర్ మండలం మరికల్ రైతు వేదికలో స్థానిక నాయకులతో కలిసి ఎమ్మెల్యే అందజేశారు. అనంతరం పలువురి ఇంటి నిర్మాణానికి భూమి పూజ చేశారు.