KMR: జుక్కల్ మండలం పెద్ద ఎడిగి గ్రామంలో పెద్ద చెరువు ప్రధాన కాలువ మరమ్మత్తు పనులను ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ఆదివారం పరిశీలించారు. 20 ఏళ్ల నుంచి ఈ కాలువను పట్టించుకునేవారు లేక పంట పొలాలకు నీరు అందక రైతులు ఇబ్బందులు పడ్డారని అన్నారు. సమస్య తన దృష్టికి రావడంతో వెంటనే కాలువ మరమ్మత్తు పనులు చేపట్టినట్లు తెలిపారు.