SKLM: పలాస కాశీబుగ్గ మునిసిపాలిటీ 8వార్డులో నర్సిపురం గ్రామ దేవత అమ్మవారి సంబరాలు ఘనంగా నిర్వహించారు. సందర్భంగా అమ్మవారిని మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు ఆదివారం దర్శించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గ ప్రజలు ఆయురారోగ్యాలు సుఖసంతోషాలతో ఉండాలని మొక్కుకున్నట్లు తెలిపారు. ఆయనతోపాటు పలువురు నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.