SKLM: సంతబొమ్మాళి మండలం బోరుభద్ర జడ్పీ హైస్కూల్లో చదువుకున్న 2004- 2005 టెన్త్ బ్యాచ్ ఆదివారం పాఠశాలలో ఆత్మీయ కలయిక ఏర్పాటు చేసుకున్నారు. 20 సంవత్సరాల క్రితం విడిపోయిన ఈ బ్యాచ్ స్నేహితులు మళ్లీ కలుసుకొని ఒకరినొకరు ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. ఈ మేరకు అప్పట్లో వారికి విద్య నేర్పించిన గురువులకు సత్కరించారు. ఆటపాటలతో సందడి చేసుకున్నారు.