MNCL: బీడీ పరిశ్రమకు నష్టం చేసే కోప్టా చట్ట సవరణలను ప్రభుత్వం మానుకోవాలని CITU మంచిర్యాల జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్ డిమాండ్ చేశారు. ఆదివారం జన్నారంలోని సిఐటియు కార్యాలయంలో సీఐటీయు నాయకులు, బీడీ మహిళా కార్మికులతో సమావేశం నిర్వహించారు. బీడీ పరిశ్రమపై తెలంగాణలో ఏడు లక్షల మంది ఉపాధి పొందుతున్నారని, వారికి నష్టం చేయవద్దన్నారు.