MNCL: ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్ల కోసం నిర్వహిస్తున్న బడిబాటకు మంచి స్పందన వస్తుందని జన్నారం మండలంలోని కలమడుగు జడ్పీ పాఠశాల హెచ్ఎం కట్ట రాజమౌళి అన్నారు. ఆదివారం జన్నారం మండలంలోని చింతలపల్లి, లింగాయపల్లి గ్రామాల్లో ఉపాధ్యాయులతో కలిసి బడిబాట కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్న సౌకర్యాల గురించి తల్లిదండ్రులకు వివరించారు.