PLD: రొంపిచర్ల మండలం వీరాట్నం, సుబ్బయ్యపాలెం సమీపంగా ఉన్న ఎన్ఎస్పీ కాలువలో పూడికతీత పనులను ఆదివారం ఎమ్మెల్యే అరవిందబాబు ప్రారంభించారు. కాలువకు ఇరువైపులా పెరిగిన గడ్డి, పిచ్చిమొక్కలను వెంటనే తొలగించాలని అధికారులను ఆదేశించారు. కూటమి ప్రభుత్వం రైతుల వెన్నుదన్నుగా నిలుస్తుందని, త్వరలో వారికి ఆర్థిక సహాయం అందించనున్నారని తెలిపారు.