ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య దాడుల నేపథ్యంలో పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టెహ్రాన్లోని ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ ప్రాజెక్టుపై వరుస దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ తెలిపింది. ఇరాన్కు చెందిన మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ హెడ్ క్వార్టర్స్, SPND న్యూక్లియర్ ప్రాజెక్టుపై దాడులు జరిపినట్లు పేర్కొంది. ఈ మేరకు ఎక్స్ ఖాతాలో పోస్టు పెట్టింది.