GNTR: మేడికొండూరు మండలం పేరేచర్లలో ఓ సంస్థ చేపట్టిన స్కైసిటీ ప్రాజెక్ట్ ఆదివారం ప్రారంభమైంది. కార్యక్రమంలో ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్, APIDC చైర్మన్ డేగల ప్రభాకర్ పాల్గొని బ్రోచర్ ఆవిష్కరించారు. సామాన్యుల ఇంటి కలలను నిజం చేసే దిశగా సంస్థ ముందడుగు వేసిందన్నారు. అమరావతి ప్రపంచంతో పోటీపడే స్థాయిలో ఎదుగుతుందన్న విశ్వాసం వ్యక్తమైందన్నారు.