NGKL: వంగూర్ మండలం రైతులు సోమవారం సాయంత్రం నాలుగు గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో రైతు వేదికల్లో జరిగే వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో పాల్గొనాలని తిప్పారెడ్డిపల్లి క్లస్టర్ రైతు వేదిక ఏఈవో జైపాల్ ఆదివారం కోరారు. సోమవారం మండలంలోని కొండారెడ్డిపల్లి, రంగాపూర్ రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ ఉంటుందని పేర్కొన్నారు.