PPM: వీరఘట్టం మండలం హుస్సేనుపురం ఉపాధి హామీ క్షేత్ర సహాయకుడు కె. శ్రీనివాసరావు (46) శనివారం సాయంత్రం పిడుగుపడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఉపాధి పని ముగిసిన అనంతరం పోలంలో నువ్వుల పంట చూసేందుకు వెళ్లాడు. తిరిగి ఇంటికి వస్తుండగా పిడుగుపాటుకు గురై మరణించాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.